VijayaKumar

Mar 28 2024, 18:40

నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి: బుర్రు అనిల్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు


భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ 19వ మహాసభలు మండల కేంద్రంలోని ప్రగతి కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశం వేముల జ్యోతిబాసు అధ్యక్షత వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత బిజెపి సర్కార్ నూతన జాతీయ విద్యా విధానం 2022 ని తీసుకొచ్చి దేశ మేదస్సును కార్పోరేట్లకు తాకట్టు పెట్టే ప్రయత్నం సరైన కాదన్నారు ఈ విద్యా విధానం వల్ల విద్యార్థులలో మతతత్వ భావజాలాన్ని నింపటానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు విద్యాసంస్థలలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తరగతి గది నుండి కలుషితం చేయటానికి విద్యా విధానం ధోపడుతుందన్నారు పేద విద్యార్థులను దేశ అభివృద్ధిలో వారి మేధస్సును భాగస్వామ్యం చేయాల్సిన ప్రభుత్వాలే విద్యార్థుల ఐక్యతను దెబ్బతీసే విధంగా రెచ్చగొడుతూ ఈ విద్యా విధానం రాజ్యాంగ లక్షణాలను విద్యావిధానాన్ని ఏర్పాటు చేయకుండా వారి ఇష్టానుసారంగా విద్యా విధానాన్ని అమలు చేయడం సరైన కాదు అన్నారు

ఈ మహాసభల్లో మండల అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు ఎస్ కే ఫర్దిన్ ఎన్నికయ్యారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మండల సహాయ కార్యదర్శి బుగ్గ ఉదయ్ కిరణ్ వేములకొండ వంశీ మైసోళ్ళ నరేందర్ పట్టణ కార్యదర్శి సాయి,జశ్వంత్ నేహా తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Mar 28 2024, 17:07

మొగిలి పాక గ్రామంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో.

 శ్రీ భ్రమరాంబిక కేతమ్మ సహిత మల్లికార్జున స్వామి మరియు.ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినారు. గుడి చైర్మన్ గంట హరికృష్ణయాదవ్ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల నూతన గుడి నిర్మాణానికి స్థలదాత ముద్దసాని నరసింహారెడ్డి మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి మాజీ సర్పంచ్ ముద్దసాని శశికళ కుటుంబ సభ్యులకు శాలువాతో సన్మానం చేసిన్నారు. మరియు ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ దాత మెరుగు గోపాల్ యాదవ్ భార్య చైతన్య లత కుటుంబ సభ్యులకు మైసమ్మ అమ్మవారి విగ్రహ దాత మామిడి సత్తిరెడ్డి కుటుంబ సభ్యులకు గుడి నిర్మాణానికి విరాళాధాత పులిపలుపుల రాములు గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.

 వారికి శాలువతో సన్మానం కార్యక్రమం నిర్వహించి భగవంతుని తీర్థప్రసాదాలు వేద పండితుల ద్వారా అందజేసినారు.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లు ఐలయ్య. గొర్ల కాపరి సంఘం చైర్మన్ దూదిమెట్ల బాలరాజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మర్ల మల్లయ్య మాజీ సర్పంచి జక్కుల శంకరయ్య. భీమనబోయిన బిక్షపతి. మర్ల మల్లేశం యాదవ్ సంగం అధ్యక్షులు. అధిక సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

VijayaKumar

Mar 28 2024, 16:13

బిజెపి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బోళ్ళ సుదర్శన్


భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోళ్ళ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని CN రెడ్డి కాంప్లెక్స్ లో మండల పదాధికారుల సమావేశంను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ గెలుపు కొరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, కేంద్ర పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని వారు అన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు,కావున తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో లేని BRS కు ఓటు వేసిన ,రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు నెరవేర్చు తానని తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటు వేసిన ఓటు వృధా అవుతుంది కావున  భువనగిరి పార్లమెంట్ ప్రజలు బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ కు ఓటు వేసి గెలిపించాలని అని అన్నారు,

పార్లమెంట్ అభివృద్ది బీజేపీ కే సాధ్యం అని ఈ సందర్భంగా వారు అన్నారు అదేవిధంగా ఇటీవల నూతనంగా నియమితులైన మండల పధాది కారులకు ,మోర్చా అధ్యక్షులకు పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను, మోర్చా కమిటీలను ఏర్పాటు చేసి బూర నరసయ్య గౌడ్ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడే లింగస్వామి, ఉపాధ్యక్షులు డోగుపర్తి సంతోష్, గంగాదారి దయాకర్, వట్టిపల్లి సంతోష్, కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, మండల కార్యదర్శి మందుల నాగరాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంతం రామచంద్రం, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వేలిమినేటి వెంకటేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిన్నం అంజమ్మ ,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొలుగుల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Mar 27 2024, 17:27

మోత్కూరు ఎంపీడీవో కార్యాలయం పై ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన పంచాయతీ కార్యదర్శి


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామ పంచాయతీ సెక్రెటరీ కిరణ్. ఓ వ్యక్తి ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేశారు రూపాయలు 3000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సెక్రెటరీ కిరణ్. ఇదివరకే రూపాయలు 5000 ఇచ్చిన బాధితుడు.

VijayaKumar

Mar 27 2024, 13:19

పాము కాటుతో పదవ తరగతి విద్యార్థి మృతి


పాము కాటుతో ఓ పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల మమత, కుమార్ ల కుమారుడైన ముక్కర్ల ఉమేష్ ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 4.30 గం.లకు కట్లపాము కాటు వేయడంతో భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బుధవారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు దత్తప్ప గూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడన్నారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యార్థి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

VijayaKumar

Mar 26 2024, 19:10

తుర్కపల్లి మండల కేంద్రము లో ఓ వైన్ షాప్ లో చోరీ... నలుగురు వ్యక్తుల అరెస్ట్: మీడియా సమావేశంలో డిసిపి రాజేష్ చంద్ర


యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని ఇటీవల ఓ వైన్ షాప్ చోరీ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 2 లక్షల 4 వేల నగదుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

VijayaKumar

Mar 26 2024, 18:53

గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం వర్ధంతి


చట్టసభలలో పట్టుబట్టి ప్రజా సంఘాల హక్కులను సాధించిన ప్రజల మనిషి, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మ గానిధర్మబిక్షం 

దేశ, రాష్ట్ర చట్టసభలలో తన గల మెత్తి, పట్టుబట్టి

ప్రజా సంఘాల హక్కులను సాధించినమహాయోధుడైన స్వర్గీయ కామ్రేడ్ బొమ్మ గాని ధర్మ బిక్షం గారి 13వ వర్ధంతి సందర్భంగా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామం పరిధిలోని తాటి వనంలో సిపిఐ పార్టీ గీతా పనివారల సంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు శాంతి కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ ధర్మాభిక్షం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడని పేర్కొన్నారు.

1957 వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా పరిధిలోని గార్ల గ్రామంలో గీత పనివాళ్ల సంఘాన్ని స్థాపించాడని, అనంతరం ప్రతి గ్రామంలో గీత పని వారల సంఘాలను ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు.

1952 వ సంవత్సరంలో ఉమ్మడి జిల్లా లోని సూర్యాపేట ఎమ్మెల్యేగా,

1957 నో నకిరేకల్ ఎమ్మెల్యేగా, 1963 లో నల్లగొండ ఎమ్మెల్యేగా ధర్మ బిక్షం గెలుపొందడం జరిగిందని, అలాగే/1990--92 సంవత్సరాలలో రెండుసార్లు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ నుండి విజయం సాధించాడని ఆయన తెలిపారు.

ప్రజా ప్రతినిధిగా చట్టసభలలో ప్రజా సంఘాల హక్కులకై తన గలమెత్తి, పట్టుబట్టి హక్కులను సాధించిన మహాయోధుడని కొనియాడారు.

గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి మృతి చెందిన కుటుంబాలకు ధర్మ బిక్షం ప్రభుత్వాలతో పోరాడి ఎక్స్గ్రేషన్ మంజూరు చేయించిన ఘనుడన్నారు.

ఈ ఎక్స్గ్రేషియా తొలుత 

10వేల రూపాయలు ఉండగా అంచేలంచలుగా

2 లక్షల రూపాయల వరకు చేయించాడని, అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతిగీత కార్మికునికి200

రూపాయలు పెన్షన్ మంజూరు చేయించిన మహానుభావుడ నీ ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రతి గ్రామానికి తాటి ,ఈత చెట్లు పెంపొందించుకునేందు కై

ప్రభుత్వాలతో పోరాడి 5 ఎకరాల భూమిని కేటాయించాలని పట్టుబట్టి 560 జీవోను సాధించిన ఘనుడు ధర్మ బిక్షమని పేర్కొన్నారు.

తన జీవితాన్ని ఉద్యమాలకు, పోరాటాలకు, ప్రజా హక్కుల సాధనకై గడిపిన ధర్మభిక్షం ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిమ్మల అంజయ్య గౌడ్, చిలుకూరి లక్ష్మయ్య గౌడ్, జలంధర్, సైదులు, వెంకట్ నర్సు, కుమ్మరి మల్లయ్య, బోడ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Mar 26 2024, 18:23

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి


బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి ని మంగళవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో బెహెన్ జీ కుమారి మాయావతి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నియమించారు. తెలంగాణ చీఫ్ గా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రాజీనామా నేపథ్యంలో పార్టీ పట్ల విధేయత కలిగిన వారికి, రాజీ పడని వారికి అవకాశమిస్తే బహుజన వాదం గెలుస్తుందన్న ఆలోచనతోనే ఈ నియామకం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి నకిరేకల్ నియోజకవర్గంలో గడపగడపకు ఏనుగు గుర్తును ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లామన్నారు.బహుజనుల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అన్నారు. బహుజనులంతా ఏకతాటిపై వచ్చి అన్ని రంగాల్లో తమ వాటా సాధించుకోవాలన్నారు. తనకు రాష్ట్ర కమిటీ లో చోటు కల్పించిన నేషనల్ కో ఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతం , రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మరియు నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

VijayaKumar

Mar 26 2024, 18:04

భువనగిరి భాజపా పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో రజాకార్ సినిమా ప్రదర్శన


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ని శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ లో గూడూరు నారాయణరెడ్డి నిర్మాత గా యాట సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మించిన రజాకార్ సినిమాను మంగళవారం, బుధవారం రోజులలో ఈ సినిమాని రెండు షోలు భారతీయ జనతాపార్టీ సినియర్ నాయకులు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో రజాకార్ సినిమాను రెండు రోజులు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.

వలిగొండ మండల ప్రజలు నాయకులు బిజెపి పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వలిగొండ సినిమా థియేటర్ కు వచ్చి రజాకార్ సినిమాలు తిలకించి ఆనాడు రజాకారుల నాయకుడు కాశీం రజ్వి చేసిన అరాచకాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన రజాకార్ సినిమా దర్శకులు యాట సత్యనారాయణకు నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన మండలం భాజపా నాయకులు ఎన్నో వ్యయ ప్రయాసలను భరించి ఈ రజాకార్ సినిమా నిర్మించినందుకుగాను వారికి వారి సినిమా యూనిట్ కు ధన్యవాదములు తెలుపవలసిందిగా కోరడం జరిగినది. ఈ సినిమా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఇతరులకు చూసే విధంగా ప్రోత్సహించాలని కోరడం జరుగుతుంది. మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ బచ్చు శ్రీనివాస్ గుప్తా, భాజపా కిసాన్ మోర్చా మండల శాఖ అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్, సీనియర్ నాయకులు దంతూరి సత్తయ్య, గౌడ్ సీలోజు శ్రీరాములు, బందారపు రాములు, రాచకొండ కృష్ణ, బాసవాడ బిక్షపతి, మంద నరసింహ, తదితర నాయకులు మండల ప్రజలకు రజాకార్ సినిమాను తిలకించవలసిందిగా కోరడం జరుగుతుంది.

VijayaKumar

Mar 26 2024, 17:26

ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నాయకుడికి 100 ప్రశ్నలు లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నయకుడికి 100 ప్రశ్నలు కార్యక్రమంలో భాగంగా భువనగిరి పరిధిలోని దీప్తి హోటల్ నందు మంగళవారం రెండు గంటలకు ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల్లో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని ఇప్పటికే 118 గ్రామాల్లో పర్యటించి అండర్ పాస్ ను సాంక్షన్ చేశామని అన్నారు. యాదాద్రి ని యాదగిరిగుట్ట గా పేరు మార్చామని కొండపైకి ఆటోల కు అనుమతి కల్పించి 300 కార్మికుల సమస్యలను తీర్చామని అన్నారు. కొండపైన భక్తులు నిద్రించే సౌకర్యం కల్పించడం జరిగిందని మరియు కొబ్బరికాయలు కొట్టే స్థలం ఏర్పాటు చేశామని అన్నారు.